Test Footer

Dono Ilmu News

నేను సెకండ్ సెటప్ ని కాను - తాప్సీ


తాప్సీ
"ఘుమ్మంది నాదం" ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన హీరోయిన్ తాప్సీ. ఆ తర్వాత "వస్తాడు నా రాజు" లో నటించింది. ఈ రెండు సినిమాలు మినహా తాప్సీ చేసిన ప్రతీ సినిమాలోను ఇద్దరు హీరోయిన్ లు ఉంటారు. మిస్టర్ పర్‌ఫెక్ట్ లో కాజల్ అగర్వాల్, తాప్సీ జంటగా నటించారు. ఇప్పుడు రాబోతున్న రవితేజ "వీర" లో కూడా కాజల్, తాప్సీ జంటగా నటిస్తున్నారు. అయితే ఇటువంటి క్యారక్టర్ లు ఎంచుకోవడం వలన తాప్సీ ని అందరూ సెకండ్ హీరోయిన్ అంటున్నారట. ఇదే విషయాన్ని తాప్సీ దగ్గర ప్రస్తావించినప్పుడు - "నేనేం సెకండ్ హీరోయిన్ ని కాదు. మిస్టర్ పర్‌ఫెక్ట్ లో కాజల్ పాత్రకి నా పాత్రకి సమాన ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే చిత్రాల్లో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్లనే ఎంచుకుంటాను" అని చెప్పిందట తాప్సీ.