వరుస చిత్రాలతో పండగ చేయనున్న రాంచరణ్ తేజ్

రాంచరణ్ తేజ్
ప్రస్తుతం రాంచరణ్ తేజ్ వరుసగా మూడు సినిమాలకు అంగీకరించాడు. ముగ్గురు అగ్ర హీరోయిన్ లతో రూపొందుతున్న ఈ చిత్రాలతో అభిమానులకు పండగ చేయనున్నాడు మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్. సంపత్ నంది దర్శకత్వం లో వస్తున్న "రచ్చ" సినిమా లో రాంచరణ్ తేజ్ సరసన తమన్నా జత కడుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వం లో వస్తున్న చిత్రానికి సమంత హీరోయిన్ గా ఎంపికయ్యింది. తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రాంచరణ్ తేజ్ ఖరారు చేసుకున్న చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుందని ప్రాధమిక సమాచారం. తెలుగు సినిమా చరిత్రని తిరగ రాసిన మగధీర తర్వాత మరోసారి రాంచరణ్ తేజ్ సరసన నటించనుంది కాజల్ అగర్వాల్. మొత్తానికి రానున్న రోజుల్లో మెగా అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి.