మాజీ ప్రియుడి పై ప్రియురాలి ఆగ్రహం

ప్రియమణి పృధ్వీరాజ్
తెలుగు లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఉన్న ప్రియమణి, పృధ్వీరాజ్ లు చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి సినిమాల్లో కూడా నటించారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని అప్పట్లో చాలానే వార్తలు వచ్చాయి. దాని తర్వాత ప్రియమణి తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే పృధ్వీరాజ్ ఇటీవల ఓ పాత్రికేయురాలుని పెళ్ళి చేసుకున్నాడట. ఈ పెళ్ళికి సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరినీ ఆహ్వానించలేదట. ప్రియమణి కి కూడా ఎలాంటి ఆహ్వానం అందలేదట. దీంతో ప్రియమణి పృధ్వీరాజ్ పై చాలా కోపంగా ఉందట. కోపం వెనుక అసలు కారణమేంటో ప్రియమణి కే తెలియాలి.