రాంచరణ్ తేజ్ తో రచ్చ చేయనున్న కలర్స్ స్వాతి ?

కలర్స్ స్వాతి
రాంచరణ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం లో రూపొందుతున్న తాజా చిత్రం "రచ్చ". రాంచరణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రమిది. ఇందులో రాంచరణ్ తేజ్ సరసన తమన్నా నటిస్తోంది. అయితే ఇందులో మరో హీరోయిన్ గా కలర్స్ స్వాతి ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య అంతగా అవకాశాలు లేని స్వాతి ఏకంగా రాంచరణ్ తేజ్ తో అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబైపోతుందట. మరి ఈ సినిమా తోనైనా ఈ యంగ్ గర్ల్ కి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి.