పవణ్ కళ్యాణ్ పంజా షూటింగ్ పూర్తి

టాలీవుడ్ పవర్‌స్టార్ పవణ్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం "పంజా". అయితే నేటితో పంజా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్ లతో రూపొందిన ఈ చిత్రం యొక్క మిక్సింగ్ పనులు చెన్నై లో జరుగుతున్నట్టు సమాచారం. ఇది వరకే పంజా సినిమా ఆడియో విడుదలై మంచి టాక్ ని తెచ్చుకుంది. పవణ్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ మరియు పాటల సక్సెస్ అన్నీ కలిసి సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాల్ని పెంచాయి.