Test Footer

Dono Ilmu News

టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న బాలీవుడ్





బాలీవుడ్ పరిశ్రమ టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విధానం 1980 లో ఎక్కువగా ఉండేదని మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.


ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ "రెడీ" చిత్రాన్ని రీమేక్ చేసిన తరువాత "ఢీ" చిత్రాన్ని రీమేక్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో శ్రీహరి పాత్రని సంజయ్ దత్ చేస్తుండగా కథానాయకుడి పాత్రని అభిషేక్ బచ్చన్ చేస్తున్నారు. రవితేజ బ్లాక్ బస్టర్ "విక్రమార్కుడు" చిత్రాన్ని "రౌడీ రాథోడ్" పేరుతో రీమేక్ చేస్తున్నారు. రాజమౌళి, సునీల్ ల "మర్యాద రామన్న" చిత్రాన్ని "సన్ ఆఫ్ సర్దార్" పేరుతో రీమేక్ కి అజయ్ దేవగన్ ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి బాలీవుడ్ లో మన టాలీవుడ్ పరిశ్రమకి మంచి పేరు ఉందనే చెప్పాలి.