నాగార్జున షిర్డీ సాయిబాబా ప్రారంభానికి సన్నాహం



ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం షిర్డీ సాయిబాబా. ఎం ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూపు వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రసాద్ కలర్ ల్యాబ్ లో ఈ సినిమా కి సంబంధించిన పాటల సిట్టింగ్స్ జరుపుతున్నారు. పాటలు సంప్తృప్తికరంగా వచ్చిన తర్వాతనే సినిమా షూటింగ్ ప్రారంభించాలని టీం భావిస్తున్నారు.


సాయిబాబా పాత్రలో కనిపించబోతున్న నాగార్జున మాట్లాడుతూ ఇంతవరకు నన్ను ఒక తరహాలో చూశారు. ఇక నుంచి విభిన్న గెటప్ లో చూడబోతున్నారు అని తెలిపారు. సాయిబాబా గెటప్ లో కనిపించడానికి గడ్డం జుట్టు బాగా పెంచుతున్నట్లు తెలుపు రంగులోకి మార్చనున్నట్లు తెలిపారు.